
ఓర్వలేకే బీజేపీ కుట్ర
నర్సాపూర్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే బీజేపీ ఈడీ పేరుతో భయబ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్గాంధీ పేర్లను చార్జిషీట్లో నమోదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మా నాయకుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్, నాయకులు మల్లేష్, చిన్న ఆంజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై
అవగాహన అవసరం
హవేళిఘణాపూర్(మెదక్): ప్రజలకు ఏదైనా నష్టం జరిగితే చట్టాలను వినియోగించుకొని తగిన న్యాయం పొందవచ్చని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ అన్నారు. గురువారం మెదక్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వినియోగదారుల హక్కులు, ప్రామీ సరీ నోట్పై ప్రజలకు అవగాహన కల్పించారు. రైతు ఏదైనా కంపెనీ నుంచి పొందిన వస్తువు నకిలీ అని తేలితే వారిపై కేసు నమోదు చేసి పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో షీటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్పామ్తో
అధిక లాభాలు
కొల్చారం(నర్సాపూర్): ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ మేనేజర్ అశోక్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని రంగంపేట పంచాయతీ ఆవరణలో రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ద్వారా రూ. 193 విలువ గల మొక్కను సబ్సిడీ కింద రూ. 20కే అందిస్తున్నట్లు తెలిపారు. డ్రిప్ ఏర్పాటు కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ, ఇతరులకు 90 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జైన్ లిఫ్ట్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు సంజీవరావు, కష్ణ రైతులు పాల్గొన్నారు.
రికార్డుల పరిశీలన
తూప్రాన్: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రికార్డులను గురువారం జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు. ఈసందర్భంగా గ్రా మాల వారీగా రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల వివరాలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సోషల్ ఆడిట్పై ఆరా తీశారు. ఎండల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషాద్రి, ఎంపీఓ సతీష్, ఏపీఓ సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు.
21న ఐటీఐలో
అప్రెంటీస్షిప్ మేళా
మెదక్ కలెక్టరేట్: ఈనెల 21వ తేదీన మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐల్లో పలు కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్షిప్ మేళా ఉంటుందన్నారు. ఇందులో ఎంఆర్ఎఫ్, గ్రౌండ్ ఫార్మా లిమిటెడ్, మేధా సెర్వో, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ తదితర కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కోఫా, ఇతర ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఓర్వలేకే బీజేపీ కుట్ర

ఓర్వలేకే బీజేపీ కుట్ర