దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేయడంతో ముంబై వెళ్లడానికి ఉత్తర తెలంగాణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్లి అక్కడి నుంచి మరో రైలులో వెళ్లాల్సి వస్తోంది. అర్ధంతరంగా రద్దు చేసిన దాదర్ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల రైలు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. నాసిక్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే భక్తులకు ఉపయుక్తం కానుంది. రైల్వేశాఖ అధికారులు ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. – మంతెన శ్రీనివాస్,
రైలు ప్రయాణికుడు, బెల్లంపల్లి


