టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా వెడ్మ బొజ్జు | - | Sakshi
Sakshi News home page

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా వెడ్మ బొజ్జు

Jun 25 2025 7:04 AM | Updated on Jun 25 2025 7:04 AM

టీపీస

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా వెడ్మ బొజ్జు

ఉట్నూర్‌రూరల్‌: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను నియామకమయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామకం పత్రం అందుకున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.

టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా సుగుణ

టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ నియామకమయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా వెడ్మ బొజ్జు1
1/1

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా వెడ్మ బొజ్జు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement