కంపోస్టు ఎరువు ఉపయోగించాలి | - | Sakshi
Sakshi News home page

కంపోస్టు ఎరువు ఉపయోగించాలి

May 22 2024 11:45 PM | Updated on May 22 2024 11:45 PM

జైపూర్‌: కంపోస్ట్‌ పిట్‌ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, వాటి ద్వారా వచ్చే ఎరువులను నర్సరీలు, పల్లెప్రకృతి వనంలో మొక్కలకు అందించాలని డీపీవో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మండలంలోని ముదిగుంట, జైపూర్‌ గ్రామ పంచాయతీలను బుధవారం ఆయన సందర్శించారు. సెగ్రిగేషన్‌ షెడ్‌లను పరిశీలించి కంపోస్ట్‌ ఎ రువుల తయారీపై పలు సూచనలు చేశారు. రోడ్లు, డ్రెయినేజీలు నిరంతరం శుభ్రం చేయాలని, ప్రతీ రోజు ఇంటింటికీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ద్వా రా చెత్త సేకరించాలని తెలిపారు. ఎంపీవో అనిల్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు ఉదయ్‌, సురేశ్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement