విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో భోజనం చేయగా.. 9 గంటల తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరు వాంతులు చేసుకున్నారు. గమనించిన హాస్టల్ సిబ్బంది అంబులెన్స్కు సమాచారం అందించగా ఎస్ఐ మురళి సిబ్బందితో అక్కడికి చేరుకొని ముందుగా మూడు అంబులెన్స్లలో 35
మంది విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరో 20 మంది విద్యార్థులు చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకోగా.. మొత్తం 55 మంది విద్యార్థులను ఆస్పత్రిలోని రెండు మెడికల్ వార్డులలో ఉంచి 20 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారు. – ఎర్రవల్లి
విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స


