
జూరాలలో జోరుగా విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి వరద నీరు చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగంగా కొనసాగుతుంది. ఈమేరకు గురువారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతున్నట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 34.713 ఎంయూ, దిగువలో 6 యూనిట్లద్వార 240 మెగావాట్లు, 38.506 మిలియన్ యూనిట్ల విద్యు దుత్పత్తిని చేపడుతున్నారు. ప్రస్తుతం 39 వేల క్యూ సెక్కుల నీటిని వినియోగించి ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 73.219 ఎంయూల విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.
శ్రీశైలానికి 38,663 క్యూసెక్కులు
దోమలపెంట: జూరాలలో గురువారం విద్యుదుత్పత్తి చేస్తూ 36,415 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 2,248 మొత్తం 38,663 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 847.1 అడుగుల వద్ద 73.9870 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో విద్యుదుత్పత్తి, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు నీటి విడుదల జరగలేదు.
11 యూనిట్లలో 435 మెగావాట్ల ఉత్పత్తి
39 వేల క్యూసెక్కుల నీటి వినియోగం