
లూజ్ విత్తనాలతో జాగ్రత్త
అలంపూర్: వానకాలం పంటల సీజన్ ఆరంభమవుతోంది. అన్నదాతలు ఆరుగాళం కష్టించడానికి సిద్ధమవుతున్నారు. పంటసాగులో కీలక భూమికను నిర్వహించే విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న వానకాలం సీజన్కు కావాల్సిన విత్తనాల కొనుగోలు చేసే రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ సూచించారు. దళారులు రైతులకు లూజ్ విత్తనాలు విక్రయించి మోసం చేస్తారని హెచ్చరించారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు లూజుకు కంపెనీ(ప్యాకెట్లలో) తేడాలు తెలుసుకుంటే మంచిదన్నారు. ఈ విషయంలో అవగాహన ఉంటే పంటసాగు నుంచే ఇలాంటి నష్టాలను నివారించుకోవచ్చని అవగాహన కల్పిస్తున్నారు.
దళారులు అమ్మే లూజ్ విత్తనాలు
● విత్తనాలకు ఎటువంటి నాణ్యత ఉండదు.
● విత్తనాల తయారీలో కంపెనీ, ధృవీకరణ అధికారుల ప్రమేయం ఉండదు.
● లూజు విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో ఎటువంటి బిల్లు ఇవ్వరు.
● ప్రాసెసింగ్, శుద్ధి ఇతర ప్రమాణాలు ఉండవు.
● విత్తనాలు విత్తినప్పుడు, పంట మధ్యకాలంలో పూత, కాత దశలో ఏమైనా నష్టాలు జరిగితే రైతులకు న్యాయం జరగదు.
● విత్తనాలకు జన్యు నాణ్యత ఉండదు.
● విత్తనాలను దళారులు రైతులను మోసం చేసేవారు మాత్రమే విక్రయిస్తారు.
పాడి–పంట
కంపెనీ ప్యాకుడు విత్తనాలు
విత్తనాలకు పూర్తి నాణ్యత ఉంటుంది.
విత్తనాల తయారీలో వివిధ దశల్లో కంపెనీ, ధృవీకరణ అధికారులు పాల్గొంటారు.
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా బిల్లు ఇస్తారు.
విత్తన తయారీలో ప్రాసెసింగ్, శుద్ధి, ఇతర నాణ్యత ప్రామాణాలు తప్పక పాటిస్తారు.
విత్తనాలు కొనగోలు చేసిన సమయంలో రైతులకు బిల్లు ఇస్తారు. కాబట్టి పూర్తి న్యాయం జరుగుతుంది.
విత్తనాలకు ఖచ్చితంగా జన్యు నాణ్యత ఉంటుంది.
ఈ విత్తనాలు వ్యవసాయ శాఖవారిచే లైసెన్సు పొందిన డీలర్లు విక్రయిస్తారు.

లూజ్ విత్తనాలతో జాగ్రత్త

లూజ్ విత్తనాలతో జాగ్రత్త