బైక్‌ అదుపుతప్పి.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి..

Jun 9 2025 12:56 AM | Updated on Jun 9 2025 12:56 AM

బైక్‌

బైక్‌ అదుపుతప్పి..

బైక్‌ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మిడ్జిల్‌ మండలం వేముల శివారులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బాలానగర్‌ మండల పోచ్చమ్మగడ్డ తండాకు చెందిన చంద్రునాయక్‌ (42) మిడ్జిల్‌ మండలంలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై తిరిగి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో వేముల శివారులో బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌ నాయుడు తెలిపారు.

అమ్మమ్మ అంత్యక్రియలకు కట్టెలు తెచ్చేందుకు వెళ్లి..

ట్రాక్టర్‌ బోల్తాపడి యువకుడి దుర్మరణం

తన అమ్మమ్మ అంత్యక్రియలకు అవసరమైన కట్టెలు తీసుకురావడానికి ట్రాక్టర్‌పై వెళ్లిన మనువడు దుర్మరణం చెందిన ఘటన గండేడ్‌ మండలం బల్సుర్‌గొండ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బల్సుర్‌గొండకు చెందిన మల్లెపల్లి పద్మమ్మ (70) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని దహనం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన కట్టెలు తీసుకురావడానికి పద్మమ్మ మనువడు మల్లెపల్లి బాలవర్ధన్‌రెడ్డి (40) ట్రాక్టర్‌ తీసుకొని గండేడ్‌కు వెళ్లాడు. కట్టెలు లోడు చేసుకొని తిరిగి వస్తుండగా.. కొండాపూర్‌ సమీపంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాక్టర్‌ నడుపుతున్న బాలవర్ధన్‌రెడ్డికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అమ్మమ్మ, మనువడు ఇద్దరు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మధ్యాహ్నం పద్మమ్మ అంత్యక్రియలు నిర్వహించగా.. సాయంత్రం బాలవర్ధన్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అతడికి భార్య ఉంది. గ్రామంలో వీబీకేగా పనిచేసే వాడని గ్రామస్తులు తెలిపారు.

బైక్‌ అదుపుతప్పి.. 
1
1/1

బైక్‌ అదుపుతప్పి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement