
మామిడి తోటలో భారీ కొండచిలువ
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామ శివారులో గల సర్వేశ్వర్ రెడ్డికి చెందిన మామిడి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువ దదర్శనమిచ్చింది. తోటలో పనికి వెళ్లిన కూలీలకు కొండచిలువ కనబడడంతో వెంటనే తోట యజమాని సర్వేశ్వర్ రెడ్డికి విషయాన్ని తెలుపగా ఆయన ఎస్ఐ శివకుమార్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎస్ఐ స్నేక్ సొసైటీ నిర్వాహకులు కృష్ణసాగర్కు విషయం తెలుపగా అతను వచ్చి కొండ చిలువను పట్టుకున్నారు. కొండచిలువ 15 అడుగుల పొడవు, 30 కిలోల బరువు ఉందని కృష్ణసాగర్ తెలిపారు. పట్టుకున్న కొండచిలువను ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అడవి ప్రాంతంలో వదిలివేస్తామన్నారు. ఎవరికై నా పాములు కనిపిస్తే చంపొద్దని, తనకు సమాచారం ఇస్తే పట్టుకుని అడవిలో వదిలేస్తానన్నారు. ఆయన వెంట స్నేక్ సొసైటీ సభ్యులు ఏర్పుల గోపాల్ యాదవ్, కావలి భాస్కర్, మహబూబ్, మైనుద్దీన్, భాగ్యలక్ష్మి, పెంటన్న, పల్లవి, వనజ, ఫాతిమా, ఉన్నారు.