
వికసించిన మే పుష్పం
సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూసే అరుదైన మే పుష్పం వికసించింది. కోస్గి పట్టణంలోని వార్ల మల్లేశం ఇంట్లోని టెర్రస్ గార్డెన్లో మే పుష్పం వికసించి అందరినీ అకట్టుకుంటోంది. మే నెలలో మాత్రమే పుష్పించే ఈ మొక్క వృక్షరాజ్యంలో అమరిల్లిడేసి కుటుంబానికి
చెందింది. కేవలం మే నెలలో మాత్రమే వికసిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని పాడేరు నుంచి తాను పదేళ్ల క్రితం ఈ మొక్క దుంపను
తెచ్చి కుండీలో నాటానని.. ప్రతి ఏటా మే నెలలో ఒక పువ్వు మాత్రమే వచ్చేదని.. ఈసారి నాలుగు పువ్వులు వికసించాయని మల్లేశం
తెలిపారు. జూన్ వరకు ఈ పుష్పాలు
ఉంటాయన్నారు. – కోస్గి రూరల్