
బ్రాండ్ల పేర్లు ముద్రించి..
నాసిరకం విత్తనాలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. గతంలో అనేక సార్లు లూజు విత్తనాలను తీసుకువచ్చి వాటికి రంగులద్ది వివిధ బ్రాండ్ల పేర్లతో ముద్రించిన కవర్లలో ఆయా విత్తనాలను నింపి రైతులకు అంటగట్టేవారు. ఈ క్రమంలోనే పలుమార్లు నకిలీ విత్తనాలు, వాటికి సంబంధించిన కవర్లు అనేకం జడ్చర్లలో పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. పత్తి విత్తన కంపెనీలు కలిగిన భూత్పూర్లో సైతం అధికారులు పలుమార్లు సోదాలు చేసి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనపర్చుకున్నారు.
తక్కువ ధరకు విక్రయం..
కొందరు రైతులు ప్రభుత్వం నిషేధించిన బీజీ–3 పత్తి విత్తనాలను గుట్టుగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లేని బీజీ–3 (హెచ్టీ) పత్తి విత్తనాలను సైతం కొందరు వ్యాపారులు లోగుట్టుగా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి ఇప్పటికే లూజు పత్తి విత్తనాలు గ్రామాలకు చేరాయి. తక్కువ ధరకు (కిలో రూ.వెయ్యి నుంచి రూ.1,500) పత్తి విత్తనాలు అందజేస్తుండటంతో రైతులు వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బీటీ–1, 2 రకాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ, బీజీ–3 పత్తి విత్తనాలకు ఇవ్వలేదు. అయితే అంతగా అవగాహన లేని రైతులకు కొందరు వ్యాపారులు వీటిని అంటగడుతున్నారు.
రంగులద్ది తయారు
చేసిన
నకిలీ పత్తి విత్తనాలు(ఫైల్)