
సకుటుంబ.. సపరివార.. సమేతంగా
కొత్తకోటలో ఆదివారం అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన సుమారు 250 మంది ఒకేచోట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆటపాటలతో సరదాగా గడిపారు. కొత్తకోటకు చెందిన ఉపాధ్యాయుడు పలుస శేఖర్గౌడ్ ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది కుటుంబ సభ్యులు సమ్మేళనంలో పాల్గొని కుటుంబ ప్రాధాన్యతను తెలియజేశారు. మారుతున్న కుటుంబ బంధాలకు దూరమవుతున్న పిల్లలకు కుటుంబ విలువలను
తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శేఖర్గౌడ్ తెలిపారు. అలాగే
పెద్దల ఉపన్యాసాలతో కుటుంబ విలువలు, జీవన విధానం గురించి చక్కగా
వివరించారు. అనంతరం యువత, చిన్నారులతోపాటు మహిళలకు ఆటల పోటీలు
నిర్వహించి బహుమతులు అందజేశారు. – కొత్తకోట