
సంస్కారంతో కూడిన విద్య అవసరం..
విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి పెంపొందించే విధంగా వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. 3నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల వరకు శిబిరంలో చేర్చుకుని వారికి చదువుతో పాటు వివిధ కళల నైపుణ్యాల గురించి శిక్షణ ఇస్తున్నాం. మొత్తం 16 శిక్షణ శిబిరాల్లో 3వేల మంది విద్యార్థులకు 96 మంది వలంటీర్లచే తరగతులను నిర్వహిస్తున్నాం. నెల రోజులపాటు విద్యార్థులకు ఇంటి పనులతో పాటు స్వచ్ఛభారత్పై అవగాహన కల్పిస్తున్నాం. తల్లితండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించే విధంగా వారిలో ప్రేరణ కలిగిస్తున్నాం. – మాధవరెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
●