సెర్ప్‌ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

సెర్ప్‌ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

May 25 2025 10:50 AM | Updated on May 25 2025 10:50 AM

సెర్ప

సెర్ప్‌ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఎట్టకేలకు సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో అన్ని కేటగిరీల వారు ఉంటారని, విధివిధానాలు ఖరారు చేసి త్వరలోనే మరో ఉత్తర్వు జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో పదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలగనుంది. ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాగా జిల్లాలో మొత్తం 99 మంది వివిధ కేడర్లలో సెర్ప్‌ ఉద్యోగులు ఉన్నారు.

నిరీక్షణకు తెర..

సెర్ప్‌, ఈజీఎస్‌ ఉద్యోగులకు చివరిసారిగా 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బదిలీల ప్రక్రియ నిర్వహించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ వచ్చాక గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేపట్టింది. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశించారు. డీఆర్‌డీఏ అధికారులు కసరత్తు కూడా చేపట్టారు. అయితే ప్రభుత్వం వారి బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. అప్పటి నుంచి వారు మంత్రి సీతక్కతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు అందిన వెంటనే కౌన్సెలింగ్‌ నిర్వహించేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. తద్వారా జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం కలగనుండగా ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మండలాల్లోనూ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

40 శాతం మేర..

జిల్లావ్యాప్తంగా ఐకేపీలో 99 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వీరిలో 92 మంది బదిలీలకు అర్హత ఉన్న వాళ్లు ఉన్నారని అఽధికారులు చెబుతున్నారు. ఇందులో 40 శాతం వరకు బదిలీ చేయాల్సి ఉంటుంది.

మార్గదర్శకాలు రావాలి..

సెర్ప్‌ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేసింది. అయితే మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే వాటి ఆధారంగా బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతాం.

– నర్సింహులు, డీఆర్‌డీఓ

డీఆర్‌డీఓ కార్యాలయం

తప్పని ఎదురుచూపులు..

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్‌, ఈజీఎస్‌ వంటి రెండు విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సెర్ప్‌ పరిధిలో పనిచేసే ఏపీడీలు, డీపీఎంలు, ఏపపో పోస్టులకు జోనల్‌ స్థాయిలో, ఏపీఎంలు, సీసీలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో ఏపీఓ, ఈసీలు, టీసీ, డీఆర్పీ, డీడీ సీఎల్‌ ఆర్సీ, డీబీటీ మేనేజర్‌, సూపర్‌వైజర్‌ పోస్టులకు జోనల్‌ స్థాయిలో, అలాగే టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే మూడేళ్లకోసారి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే ఆయా విభాగాల్లో సుమారు ఈ ప్రక్రియ నిర్వహించలేదు. దీంతో సదరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తూ బదిలీ కోసం నిరీక్షిస్తున్నారు.

ప్రత్యేక జీఓ జారీ చేసిన ప్రభుత్వం

మార్గదర్శకాల కోసం ఉద్యోగుల నిరీక్షణ

నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తయ్యేఅవకాశం

జిల్లాలో 99 మంది ఐకేపీ ఉద్యోగులు

సెర్ప్‌ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ 1
1/1

సెర్ప్‌ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement