
మహిళా సంఘాలబలోపేతం: ఎమ్మెల్యే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఆర్పీలకు ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆర్పీలకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని భావించి వారికి ‘మహబూబ్నగర్ ఫస్ట్–నవరత్నాలుశ్రీలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే మహిళా సంఘాల పద్దులు, వారు తీసుకున్న అప్పుల వివరాలు, చెల్లింపులు తదితర సమాచారం ఒక్క క్లిక్తో ఒకేచోట తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా కంప్యూటరీకరణతో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా మహిళా సంఘాల కార్యకలాపాలు జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని కంప్యూటర్పై పూర్తి పట్టు సాధించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్కుమార్, ‘నవరత్నాలు’ పర్యవేక్షకులు గుండా మనోహర్, కాంగ్రెస్ నాయకులు రామచంద్రయ్య, ర ఘు, జహీర్, ప్రవీణ్కుమార్, అక్బర్ పాల్గొన్నారు.
రేపు గిరిజన విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తిలోని తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (టీజీఈఎంఆర్ఎస్– కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు ఈనెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని జీటీ గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, సీఈసీలలో సీబీఎస్ఈ సిలబస్కు సంబంధించి ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతిలో ఎక్కువ మార్కులు పొందిన గిరిజన విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకల్లా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లోని టీజీఈఎంఆర్ఎస్లో అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాలని, పూర్తి వివరాలకు ఫోన్ నం.94156 06618, 98557 37578, 98857 38387, 8520 041973లలో సంప్రదించవచ్చని సూచించారు.