జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో సేకరించిన చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేయడంపై దృష్టిసారించాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ వీసీ నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హరితహారం నర్సరీల్లో నీడ ఇచ్చే విధంగా నెట్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే దళితబంధు పథకం కింద మొబైల్ యాప్లో వివరాలను 93 శాతం అప్లోడ్ చేశారని, మిగతావి వెంటనే పూర్తిచేయాలన్నారు. ఎంపీఓలు నెలలో తప్పనిసరిగా 16 గ్రామ పంచాయతీలను సందర్శించి.. డంపింగ్ యార్డులను పరిశీలించాలన్నారు. నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో పన్నుల వసూలు పూర్తి చేయాలన్నారు. మైనార్టీ శాఖ ద్వారా అమలు చేస్తున్న ఆర్థిక చేయూత పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితాను పంపించాలన్నారు. పంచాయతీలకు విద్యుత్ బిల్లులు ఎక్కువ రాకుండా చూసుకోవాలన్నారు. వైకుంఠధామాల్లో అంత్యక్రియలు జరిగేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను తక్షణమే పూర్తిచేయాలని, ఈ–శ్రామ్ కింద అసంఘటిత కార్మికులను రిజిస్ట్రేషన్ చేయాలని, సోషల్ ఆడిట్ రికవరీపై దృష్టిసారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీఓ యాదయ్య, ఏపీడీ జకియాసుల్తానా, డీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చెత్తతో ఎరువు తయారీపై దృష్టిసారించాలి
Published Sat, Mar 18 2023 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement