మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో వచ్చే నెల 6వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల(జాతర)సందర్భంగా 13 మంది సభ్యులతో కూడిన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి తెలిపారు. కమిటీ చైర్మన్గా యర్రంగారి సురేశ్, సభ్యులుగా నాసిరెడ్డి నాగిరెడ్డి, మండవ రామకృష్ణ, దామెర సారయ్య, పల్నాటి సత్యం, వేమ రవి, చందర్లపాటి శ్రీనివాస్, పూజారి నరేందర్, బోడ బొర్రయ్య, కాటబోయిన నర్సింహారావు, బొడ్డు సుధాకర్, పాయం అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఈఓ తెలిపారు.


