
సోమేశ్వరస్వామివారికి నాగాభరణం బహూకరణ
పాలకుర్తి టౌన్: స్వయం భూ శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు మిశ్రమ బంగారు నాగాభరణం సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మో హన్ బాబు తెలిపారు. సోమవా రం పాలకుర్తి మండల కేంద్రంలో ని శ్రీసోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అజ్ఞాత భక్తుడు.. రూ.24లక్షల విలువైన 449 గ్రాముల మిశ్రమ బంగారు నాగాభరణం బహూకరించారు. స్వామివారి ప్రాణ మట్టంపై నాగాభరణం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మహా మండపంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బా బుకు అందజేశారు. బంగారు నాగా భరణం సమర్పించిన అజ్ఞాత భక్తుడిని ఈఓ, అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించారు.