
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
సంగెం: ఒంటరితనం భరించలేక ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లపెల్లి సుశీల, సారంగపాణి(70) దంపతులకు శారద, కుమారస్వామి, రాజు సంతానం. చిన్నతనంలో కుమారుడు కుమారస్వామి చనిపోయాడు. తర్వాత భార్య సుశీల మరణించింది. అనంతరం రేణుకను మరో పెళ్లి చేసుకున్నాడు. కూతురు శారద, చిన్న కుమారుడు రాజు వివాహాలు జరిపించారు. కొంతకాలం తర్వాత కూతురు శారద మరణించింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం రెండో భార్య రేణుక సారంగపాణిని వదిలివెళ్లింది. దీంతో కొంత కాలంగా సారంగపాణి చనిపోయిన భార్య సుశీల, కుమారుడు కుమారస్వామి, కూతురు శారదను తలుచుకుంటూ ఒంటరితనంతో మనస్తాపం చెందుతున్నారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత రాజు కుటుంబసభ్యులు ఒకగదిలో సారంగాపాణి మరోగదిలో నిద్రించారు. ఉదయం లేచిన తర్వాత మనవడు వినయ్.. సారంగపాణి గదిలో చూడగా దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు.
పెళ్లి కావడం లేదని మనస్తాపంతోయువకుడు ..
ఎల్కతుర్తి: పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో గడ్డిమందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెట్టెం సతీశ్(30) పెళ్లి కావడం లేదని కొంతకాలంగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 29న కుటుంబీకులకు చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో తల్లి మంజుల ఫోన్ చేయగా పొలం వద్ద గడ్డిమందు తాగానని చెప్పాడు. దీంతో హుటాహుటిన పొలం వద్దకు చేరుకుని సతీశ్ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.