జవాన్‌కు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

జవాన్‌కు ఘన స్వాగతం

Jun 2 2025 1:23 AM | Updated on Jun 2 2025 1:23 AM

జవాన్‌కు ఘన స్వాగతం

జవాన్‌కు ఘన స్వాగతం

మహబూబాబాద్‌ రూరల్‌: ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న తర్వాత మొదటిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన వీర జవాన్‌ రొట్టెల మహేశ్‌కు స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున అతడి మిత్రులు, పోలీసులు అపూర్వ స్వాగతం పలికారు. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రొట్టెల మహేశ్‌ ఆపరేషన్‌ సిందూర్‌లోపాల్గొని స్వస్థలానికి వెళ్లేందుకు వచ్చారు. స్వాగతం పలికిన వారిలో టౌన్‌ క్రైం ఎస్సై వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది కాసాని మౌనిక, ఉప్పుల మహేశ్‌, తుప్పతి వినోద్‌ కుమార్‌, తుప్పతి విజయ్‌ కుమార్‌, పీసీలు రహీం, అనిల్‌, నరేంద్ర వర్మ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement