
నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కలెక్టరేట్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వేదికతో పాటు విలేకరులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అలాగే కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుత్దీపాలతో అలంకరించారు. వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం 8.30గంటలకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి 8.45గంటల వరకు కలెక్టరేట్కు చేరుకుంటారు. 8.55గంటలకు ప్రభుత్వ విప్, కలెక్టర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. 9గంటలకు ప్రభుత్వ విప్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. 9.05 గంటలకు జాతీయ గీతాలాపన, 9.10 గంటలకు విప్ ప్రసంగిస్తారు. 9.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.45గంటలకు రైతులకు నాణ్యమై న విత్తనాల పంపిణీ కార్యక్రమం, 9.50గంటలకు జిల్లాలో పదో తరగతి టాపర్స్కు సన్మానం కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10గంటల వరకు కార్యక్రమాలు ముగుస్తాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి
విద్యుత్ దీపాలతో
కార్యాలయం అలంకరణ
ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్
రాంచంద్రునాయక్