
విద్యార్థుల నమోదు పెంచాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం టీస్ఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట ప్రచార జాతాను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడి మనదే–బడి బాధ్యత మనదే అనే నినాదంతో ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంతో పాటు నూతనంగా నియామకాలు చేపట్టి, టీచర్ల కొరత లేకుండా చేశామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు మల్లారెడ్డి, మురళీకృష్ణ, యాకూబ్, స్వప్న, మంజుల, సంజీవ, కుమార్, రాజశేఖర్, ప్రవీణ్, శ్రీనివాస్, వీరస్వామ, లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్