
గుండెపోటుతో ఏఎస్సై కృష్ణమూర్తి మృతి
కేసముద్రం: కేసముద్రం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై మద్దెర్ల కృష్ణమూర్తి(58) గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై మురళీధర్రాజు తె లిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం పోలీస్స్టేషన్లో ఏఎస్సై కృష్ణమూర్తి మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం విధులకు హాజరయ్యాడు. కాగా సాయంత్రం 7.30 గంటలకు గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది సీపీఆర్ చేసి.. 108వాహనంలో మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన క్రిష్ణమూర్తి ప్రస్తుతం హనుమకొండలోని వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు ఏఎస్సై కృష్ణమూర్తి ఇటీవల రాష్ట్ర పోలీస్శాఖ నుంచి ఉత్కృష్ణ పతకం అందుకున్నాడు. మరికొద్ది నెలల్లో ఆయన రిటైర్మెంట్ ఉంది. కాగా, ఏఎస్సై కృష్ణమూర్తి మృతితో కేసముద్రంలో విషాదం నెలకొంది.