
యువ వికాసానికి వేళాయె..
సాక్షి, మహబూబాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువవికాస పథకం అమలు తుది దశకు చేరింది. పెద్ద యూనిట్లు కాకుండా చిన్న యూనిట్లతో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రూ.లక్ష లోపు రుణాలు పొందే వారి ఎంపిక ప్రారంభించి జూన్ చివరి నాటికి యూనిట్లు ప్రారంభించనున్నారు.
చిన్న పెట్టుబడులకు తొలిఅవకాశం..
రాజీవ్ యువవికాసంలో ఎక్కువ మొత్తంలో సహకారం అందుతుందని భావించి ఎక్కువమంది రూ.లక్షకు పైగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం రూ. లక్షలోపు పెట్టుబడుల యూనిట్లకు తొలి అవకాశం ఇచ్చేలా ఎంపిక చేసి ఆ పైన పెట్టుబడుల యూనిట్లను తర్వాత ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, బీసీ, ఈబీసీ కేటగిరీల్లో రూ.50 వేల పెట్టుబడి లోపు 100 శాతం సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం 4,851 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకోగా అన్ని కేటగిరీలు కలిపి కేవలం 684 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదే విధంగా 90శాతం సబ్సిడీతో అందించే రూ. లక్షలోపు పెట్టుబడుల యూనిట్లకోసం అన్ని కార్పొరేషన్లకు కలిపి 3,618 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. 1,226 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతోపాటు రూ. లక్ష నుంచి రూ.2లక్షల లోపు పెట్టుబడులకోసం 3,120 యూనిట్లు లక్ష్యం కాగా 5,344 దరఖాస్తులు, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల పెట్టుబడుల యూనిట్లు 2,474 లక్ష్యంగా ఉండగా 41,477 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తక్కువ పెట్టుబడి యూనిట్లనే ఎంపిక చేయనున్నట్లు అధికారులు ప్రకటించడంతో తక్కువ పెట్టుబడి దరఖాస్తులు చేసుకొని వెనకబడ్డామని పలువురు యువకులు వాపోయారు.
ఈనెల 2 నుంచి ఎంపిక
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సం కానుకగా యువతకు ఆర్థిక భరోసా కల్పిస్తామని సీఎం ప్రకటించినట్లుగానే ఈనెల 2వ తేదీ నుంచి యూనిట్ల ఎంపిక ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు యూనిట్ల ఎంపిక, చెక్కుల పంపిణీ చేస్తారు. 10వ తేదీ నుంచి ఆయా యూనిట్ల నిర్వహణకు శిక్షణ ఇస్తారు. తర్వా త యూనిట్లు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ అంతా జూన్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రూ.లక్షకు పైగా పెట్టుబడి యూనిట్లను జూలైలో, తర్వాత రూ.2లక్షలకు పైగా యూనిట్ల ఎంపిక చేయనున్నారు.
వచ్చిన దరఖాస్తులు (రూ. 50వేల లోపు..)
– శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
రేపటి నుంచి యూనిట్ల ఎంపిక
వెంటనే శిక్షణ, యూనిట్ల ప్రారంభం
కసరత్తు చేస్తున్న అధికారులు
కార్పొరేషన్ టార్గెట్ వచ్చిన దరఖాస్తులు
ఎస్సీ 543 275
ఎస్టీ 3,685 35
మైనార్టీ 42 55
క్రిస్టియన్ 07 01
బీసీ 295 295
ఈబీసీ 279 23
మొత్తం 4,851 684
రూ. 1లక్షలోపు..
ఎస్సీ 772 53
ఎస్టీ 2,047 233
మైనార్టీ 73 227
క్రిస్టియన్ 14 03
బీసీ 566 679
ఈబీసీ 146 13
మొత్తం 3,618 1,226
రూ.లక్ష నుంచి రూ.2లక్షల లోపు
(అన్ని కార్పొరేషన్లు)
3,120 5,344
రూ. 2లక్షల నుంచి రూ. 4లక్షల వరకు
(అన్ని కార్పొరేషన్లు)
2,474 41,477
యూనిట్ల ఎంపిక షురూ..
కార్పొరేషన్ల ద్వారా అందించే ఆర్థిక భరోసా కోసం వచ్చిన దరఖాస్తులను బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ జాబితాలను సిద్ధం చేశాం. జూన్ రెండో తేదీ నుంచి రూ. లక్షలోపు పెట్టుబడుల యూనిట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రతీ ఎంపిక పారదర్శకంగా చేస్తున్నాం.

యువ వికాసానికి వేళాయె..