
జీపీఓ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గ్రామ పరిపాలన అధికారి(జీపీఓ) పోస్టుల భర్తీకి అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి మాట్లాడుతూ.. జిల్లాలో జీపీఓ పోస్టులకు 130మంది రాత పరీక్ష రాశారని, వారితో 110మంది అర్హత సాధించినట్లు చెప్పారు. వారిలో 103మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత గ్రామాలను కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
పకడ్బందీగా నిర్వహించాలి
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 3నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30నుంచి 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలికల)లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. సమావేశంలో డీఈఓ రవీందర్రెడ్డి, డీఎంహెచ్ఓ రవి రాథోడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
విత్తన దుకాణాల ఆకస్మిక తనిఖీ
కేసముద్రం: మండల కేంద్రంలోని పలు ఎరువులు, విత్తన దుకాణాలను మండల టాస్క్ఫోర్స్ టీం ఎస్సై మురళీధర్రాజు, ఏఓ వెంకన్న శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు దుకాణంలో వివిధ రకాల కంపెనీల విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, ఇన్వాయిస్లు, లైసెన్స్, స్టాక్ బోర్డు, గోదాములను పరిశీలించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జీపీఓ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్