
విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీస చదువు సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల ఏంజిల్స్ స్కూల్లో శుక్రవారం ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. శిక్షణలో నేరుకున్న అంశాలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. గుణాత్మక విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఉపాధ్యాయులు సహకరించాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఆజాద్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, అధికారులు సతీశ్, ప్రవీణ్, సదయ్య పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్రెడ్డి