
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు●
● డీఏఓ విజయ నిర్మల
దంతాలపల్లి: విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యల తప్పవని డీఏఓ విజయనిర్మల అన్నారు. మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల షాపులు, గోడౌన్లు శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. షాపుల యజమానులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన ప్రతీ రైతుకు రశీదు ఇవ్వాలని, స్టాక్ బోర్డుపై ఎప్పటికప్పుడు ధరలు, నిల్వల వివరాలు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాహిని, ఏఈఓలు దీక్షిత్ కుమార్, షాపుల యజమానులు పాల్గొన్నారు.