కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ అవుతలి మహారాష్ట్ర బార్డర్ వైపున గేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డ్ రవీందర్పై మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి గేట్ తీయాలని ఒత్తిడి చేయడంతో తీయకపోవడంతో రవీందర్పై రాయితో దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ తీవ్రంగా గాయపడడంతో మహదేవపూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దీని ఆధారంగానే దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.