
ట్రంప్ విధానాలతో విద్యార్థులకు తీవ్ర నష్టం
వరంగల్ చౌరస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో వర్తమాన దేశాలకు, విదేశీ ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ విమర్శించారు. బుధవారం మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ఇండియా(ఐక్య) పొలిట్ బ్యూరో సమావేశాల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ కొన్ని దేశాలపై కక్ష కట్టి భారీ పన్నులను విధిస్తూ అమెరికాలో చదువుకునే భారతీయ, ఇతర దేశాల విద్యార్థులపై అనేక ఆంక్షలు విధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విధానాలను వ్యతిరేకించాల్సిన భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మోకరిల్లి దేశానికి తీరని నష్టం చేకూరుస్తోందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిరణ్ జిత్ సింగ్ శేఖన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పొలిట్ బ్యూరో సభ్యుడు మహేంద్ర నేహ, అనుభవ్ దాస్ శాస్త్రి, కాటం నాగభూషణం, వల్లెపు ఉపేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఎన్రెడ్డి హంసారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలపాలి
ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై రాజ్యహింస, మావోయిస్టుల ఏరివేత పేరుతో పౌరులపై కొనసాగిస్తున్న కాల్చివేతను వెంటనే నిలపాలని ఎంసీపీఐ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు మర్రెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ శివనగర్లోని సాయి ఫంక్షన్ హాల్లో ఎంసీపీఐ కేంద్ర నాయకుడు మోర్తాల చందర్ రావు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి వెంకట్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టుల ఏరివేత పేరుతో కాల్చి చంపి వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండపడ్డారు. ఇప్పటికై నా ఆపరేషన్ కగార్ నిలిపి మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించి పౌర హక్కులను కాపాడాలన్నారు. సమావేశంలో నాయకులు నర్ల చంద్రశేఖర్ , పానుగంటి నరసయ్య, మాదం తిరుపతి, మాడిశెట్టి అరుణ్ కుమార్, తాటికొండ రవి, మాలోత్ రాజేశ్ నాయక్, సంద గణేశ్, బాషిపాక రమేశ్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు
ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్