
స్టార్టర్ మరమ్మతు చేస్తుండగా..
● విద్యుత్షాక్ తగిలి రైతు మృతి
● కాల్ నాయక్ తండాలో ఘటన
నర్సంపేట: వ్యవసాయ మోటారు స్టార్టర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తలిగి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కాల్నాయక్ తండాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పో లీసులు, తండావాసుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన గుగులోత్ భద్రు(48) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి వ ద్దకు వెళ్లాడు. నీరు పారించడానికి యత్నించగా మోటారు నడవకపోవడంతో స్టార్టర్ మరమ్మతు చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్షాక్ తగిలి పక్కనే ఉన్న వ్యవసాయబావిలో పడి అ క్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు బావిలో నుంచి భద్రు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుమారుడు విజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
● మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
మహబూబాబాద్ రూరల్: అనుమానాస్పద స్థితిలో ఆ ర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీ సుకుంటున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఉప్పల సింగారం కాలనీకి చెందిన పెండెం రాజేశ్వరరావు కుమారుడు కార్తీక్ (17) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డీవీ నాయక్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. నెలరోజుల క్రితం వచ్చిన కార్తీక్.. అకాడమీలోనే ఉంటూ శిక్షణ పొందుతున్నాడు. బుధవారం రా త్రి బహిర్భూమికని తరగతి గది నుంచి బయట కు వచ్చిన కార్తీక్.. కోచింగ్ సెంటర్ భవనంపైకి ఎక్కి తన లోయర్ (ప్యాంట్) తీసుకుంటున్నా డు. ఈ క్రమంలో అక్కడ సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై అక్క డే పడ్డాడు. వెంటనే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు చికిత్స నిమిత్తం 108లో ప్రభుత్వ జనరల్ ఆ స్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కార్తీక్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కా గా, కార్తీక్ విద్యుత్ వైర్లు పట్టుకోవడంతోనే షాక్ కు గురై మృతిచెంది ఉంటాడనే అనుమానం వ్య క్తమవుతోంది. టౌన్ ఎస్సై అలీమ్ హుస్సేన్ ఘ టనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.

స్టార్టర్ మరమ్మతు చేస్తుండగా..