
పుష్కరాల ఆదాయం రూ. 2.83 కోట్లు
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాల సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన నగదు కానుకలు, లడ్డు ప్రసాదం, రూమ్ల అద్దెలు, హోమాలు, దర్శనాల ద్వారా కాళేశ్వరాలయానికి రూ. 2.83కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ శనిగెల మహేశ్ తెలిపారు. బుధవారం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ హుండీలను లెక్కించారు. పుష్కరాలు 12 రోజులతో సహా మొత్తం 64 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,36,28,099 కోట్లు, దేవస్థానం అద్దె గదుల ద్వారా రూ.1.71లక్షలు, హోమాల ద్వారా రూ.1.23లక్షలు, శీఘ్రదర్శనం ద్వారా రూ.5.60.లక్షలు, ప్రసాదం ద్వారా రూ.1,38,36,552 కోట్లు, మొత్తం రూ. 2,83,18,651 ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. మిశ్రమ బంగారం 15 గ్రాములు, మిశ్రమ వెండి 1.750 గ్రాములు సమకూరిందని తెలిపారు. వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ సునీత, పర్యవేక్షణాధికారి నందనం కవిత ఆధ్వర్యంలో హుండీ నగదు లెక్కించారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, పుష్కరాల ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్శర్మ, సత్యనారాయణ, సత్యం, శ్యాందేవుడా, సత్యనారాయణ, సీతయ్య, ప్రశాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.