
పంటల సాగుకు సై..
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
సాక్షి, మహబూబాబాద్: రుతుపవనాలు ముందుగా రావడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా తొలకరి జల్లులు కురుస్తుండడంతో అన్నదాతలతో పాటు వ్యవసాయ అధికారులు, వ్యాపారులు అప్రమత్తమయ్యారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రైతులు మిర్చి కట్టె తీయడం, పత్తి చేను పాటు చేయడంతో పాటు దుక్కులు దున్నుతున్నారు.
దుక్కులు చేసే పనిలో..
వర్షం కురవడంతో రైతులు మిర్చి, మొక్కజొన్న, పత్తి కట్టెను తీసి దుక్కులు దున్నే పనిలో ఉన్నారు. ఇందుకోసం చిన్న రైతులు కాడెడ్లను సిద్ధం చేయగా.. మిగిలిన రైతులు ట్రాక్టర్లకు నాగళ్లు, హైవీల్స్, ఇతర పరికరాలు అమర్చే పనిలో ఉన్నారు. పదును ఉండగానే దుక్కులు పొతం చేసి.. మరోవర్షం కురిస్తే విత్తనాలు వేయాలనే ఆలోచనతో రైతులు చెలకల్లోనే గడుపుతున్నారు.
రంగంలోకి టాస్క్ఫోర్స్..
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాలు, కాలంచెల్లిన ఎరువులు, పురుగు మందులు అమ్మకుండా నివారించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పడిన బృందాలు ఇప్పటికే జిల్లాలోని పలు ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, విత్తన షాపులను తనిఖీలు చేశాయి. ప్రతీ అమ్మకానికి బిల్లులు ఇవ్వాలని, రైతులను మోసం చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేవారు. అదే విధంగా రైతుల వద్దకే అధికారులు అనే పేరుతో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వెళ్లి రైతులతో సమీక్షలు నిర్వహించారు. జిల్లా పరిస్థితికి అనుగుణంగా ఏ పంటలు వేయాలి అని సూచించా రు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
కావాల్సిన విత్తనాల వివరాలు
పంట విస్తీర్ణం విత్తనాల అవసరం అందుబాటులో ఉన్నవి
(ఎకరాలు)
వరి 2,21,282 44,256 క్వింటాళ్లు 618క్వింటాళ్లు
పత్తి 84,854 1,69,708 ప్యాకెట్లు 84,360ప్యాకెట్లు
మొక్కజొన్న 58,361 4,669 క్వింటాళ్లు 14 క్వింటాళ్లు
మిర్చి 52,249 522.49 క్వింటాళ్లు 12 క్వింటాళ్లు
కందులు 750 30 క్వింటాళ్లు 2 క్వింటాళ్లు
పెసర 4,555 182.49 క్వింటాళ్లు 9.8 క్వింటాళ్లు
మినుము 10 40 కిలోలు 20 కిలోలు
వేరుశనగ 41 21 క్వింటాళ్లు లేవు
పసుపు 463 463క్వింటాళ్లు లేవు
నువ్వులు 52 1.04 క్వింటాళ్లు 20 కిలోలు
ఇతరపంటలు 33,274 345 క్వింటాళ్లు 48 క్వింటాళ్లు
విత్తనాలు, ఎరువుల సేకరణ..
పంట సాగులో ముఖ్యమైన ఘట్టం విత్తనాల సేకరణ. కాగా గతంలో జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలతో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా.. అలాగే చీడ పీడలను తట్టుకొని అధిక దిగుబడి నిచ్చే విత్తనాలు కొనుగోలు పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో వానాకాలంలో 4,22,641 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 2,21,282 ఎకరాల్లో వరి సాగుచేసే అవకాశం ఉంది. ఇందులో కూడా ఎక్కువ మంది రైతులు సన్నరకం వరి వంగడాలనే సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే విధంగా 84,854 ఎకరాల్లో పత్తి, 52,249 ఎకరాల్లో మిర్చి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు. ఇందులో మిర్చి విత్తనాల కో సం గుంటూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లి తేవడం, నర్సరీల్లో మొ క్కలు పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. పచ్చిరొట్టకోసం ఇప్పటికే జీలుగ, జనుము విత్తనాలు కొని దుక్కిలో చల్లుతున్నారు.
న్యూస్రీల్
జూన్ నెల వరకు ఎరువులు (మె.ట..)
ఎరువు కావాల్సినవి ప్రస్తుతనిల్వ
డీఏపీ 1,002 1,206
ఎంఓపీ 152 369
ఎస్ఎస్పీ 139 834
కాంప్లెక్స్ 4,171 5,304
తొలకరి జల్లులతో రైతుల పొలంబాట
చెలక పాటు చేసేందుకు సిద్ధం
విత్తనాల సేకరణలో బిజీబిజీ
మరో వర్షం కురిస్తే విత్తనాలు నాటుడే..

పంటల సాగుకు సై..

పంటల సాగుకు సై..

పంటల సాగుకు సై..

పంటల సాగుకు సై..

పంటల సాగుకు సై..