
ప్రభుత్వ బడుల బలోపేతానికి పాటుపడాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ బడుల బలోపేతం, విద్యార్థుల నమోదుకు ఉపాధ్యాయులు పాటుపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల ఏంజిల్స్ హైస్కూల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బడిబాట ప్రచార జాత కార్యక్రమ పోస్టర్లను బుధవారం డీఈఓ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాడటమే కాకుండా.. బడి బాగుకోసం టీఎస్ యూటీఎఫ్ ప్రచారం నిర్వహించడం అభినందనీయం అన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీకృష్ణ, యాకూబ్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా టీఎస్ యూటీఎఫ్ చేసిన అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు హుస్సేన్, హరినాయక్, రమేశ్, మండలాల బాధ్యులు ప్రవీణ్ కుమార్, అబ్దుల్ అజీజ్, సుందర్ కుమార్, వెంకన్న, భిక్షపతి, షరీఫ్, పార్వ తి, అనిత, శంకర్, వీరస్వామి, రాములు, సాహెబ్ అలీ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్ రెడ్డి