
‘రాజీవ్ యువవికాసం’ పకడ్బందీగా అమలు చేయాలి
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి హైదారాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క.. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి రాజీవ్ యువవికాసం పథకం అమలుపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ యువకుల ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఈ పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి వెరిఫికేషన్ పూర్తిచేసి అర్హుల జాబితా తయారు చేసినట్లు చెప్పారు. మొదటి విడతలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ వచ్చే నెల 2 నుంచి 9వరకు అందజేయడానికి తగిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వై త్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.