
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సన్నద్ధం..
కేయూ క్యాంపస్: న్యాక్ ఏప్లస్ గ్రేడ్ కలిగిన కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 19 వతేదీతో 50 వసంతాల్లోకి అడుగిడబోతోంది. ఈమేరకు వీసీగా ప్రతాప్రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల అనంతరం తొలిసారి మంగళవారం కేయూ సెనేట్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేపట్టిన, చేపట్టబోయే పలు అభివృద్ధి అంశాలను వివరించారు. ప్రధానంగా అకడమిక్, పరిశోధనల పరంగా వర్సిటీని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. వర్క్షాప్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సెమినార్స్ నిర్వహిస్తున్నామన్నారు. రూసా నిధులతో యూనివర్సిటీలోని కే హబ్లో ఆరు రీసెర్చ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 65మందికి ప్రాజెక్టు ఫెల్లోస్ అవకాశం లభించిందని, ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల్లో స్కిల్స్ ఆధారిత కోర్సులను కూడా ప్రారంభిస్తామన్నారు. కేయూలో ఈఏడాది ఆగస్టు 19నుంచి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నామన్నారు. మూడురోజులు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహిస్తామన్నారు. అందుకు ముందు గోల్డెన్జూబ్లీ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్ప నకు ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. పూర్వ విద్యార్థులు కూడా గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగస్వాములయ్యేలా కార్యక్రమ ప్రణాళిక రూపొందించబోతున్నామన్నారు. కొత్త కోర్సుల రూపకల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధికల్పన కోర్సులపై కూడా దృష్టిసారిస్తామన్నారు. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కేయూకు బ్లాక్గ్రాంట్ గతంకంటే సుమారు రూ.9కోట్లకుపైగా పెంపుదలచేసి బడ్జెట్లో రూ. 144 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే, యూనివర్సిటీలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 50కోట్లు కేటాయిందన్నారు.
విద్యార్థులకు హాస్టల్ భవనాలు
కేయూలో 4వేలకు పైగా పీజీ తదితర కోర్సుల విద్యార్థులు ఉన్నారు. అయితే అందుకు సరిపడా హాస్టల్స్ అవసరం ఉంది. గర్ల్స్, బాయ్స్కు హాస్టల్ భవనాలు అవసరం ఉంది. వాటి నిర్మాణాల కోసం కృషి చేస్తున్నామని వీసీ తెలిపారు. అలాగే, మహిళా ఇంజనీరింగ్ అకడమిక్ బ్లాక్ను కూడా నిర్మిస్తామన్నారు.
జూలై 7న కేయూ స్నాతకోత్సవం
కేయూ 23వ స్నాతకోత్సవం జూలై 7న నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవర్మ కూడా రానున్నారని వీసీ వెల్లడించారు. వివిధ కోర్సుల్లో 546 మంది అభ్యర్థులకు గోల్డ్ మెడల్స్, 573 మంది అభ్యర్థులకు డాక్టరేట్లు ప్రదానం చేస్తారని తెలిపారు.
కేయూ భూముల పరిరక్షణకు
ప్రహరీ నిర్మాణం
కాకతీయ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు రూ. 20 కోట్లతో ప్రహరీ నిర్మించబోతున్నాం. ఇప్పటికే విజిలెన్స్, మున్సిపల్ అధికారుల సమక్షంలో రెవెన్యూ అధికారుల సర్వే పూర్తయింది. అధికారుల నుంచి ఫైనల్ రిపోర్టు రావాల్సింది. కబ్జాదారులపై కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.
ఉద్యోగులు సమయపాలన
పాటించేలా హాజరు..
కేయూలో అధ్యాపకులు, ఉద్యోగులు సమయపాలన పాటించేలా ఈఏడాది జూలైలో ఫేస్ రికగ్నినేషన్ అటెండెన్స్ ఏర్పాటు చేయాలనే యోచన ఉందని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వీసీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం పాల్గొన్నారు.
ఆగస్టు 19వ తేదీతో కేయూకు
50 వసంతాలు
అందరి సహకారంతో యూనివర్సిటీ అభివృద్ధి
ఈసారి బ్లాక్గ్రాంట్స్ పెంచిన
ప్రభుత్వం
అకడమిక్, పరిశోధనల పరంగా
ముందుకు
రూసా నిధులతో కే హాబ్
అందుబాటులోకి..
భూముల పరిరక్షణకు ప్రహరీ నిర్మాణం
వీసీ కె.ప్రతాప్రెడ్డి వెల్లడి