హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో రెగ్యులర్ ఎంఏ తెలుగుకోర్సులో ప్రవేశం పొందడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని పీఠాధిపతి గడ్డం వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హంటర్రోడ్లోని వరంగల్ ప్రాంగణంలో జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2025–2026 విద్యాసంవత్సరానికి ఎంఏ తెలుగుకోర్సులో ప్రవేశం పొందడానికి ఆసక్తి గల విద్యార్థులు తెలుగు విశ్వవిద్యాలయం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
teluguuniversity.ac.in, WWW.pstucet.org వెబ్సైట్లో వివరాలు పొందుపర్చామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 2025 జూన్24లోగా సాధారణ రుసుముతో, 2025జూన్30 వరకు ఆలస్య రుసుముతో సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9989417299, 9989139136 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.