
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ స్కూల్లో సోమవారం లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. భూభారతి చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొదటి విడతలో 203 మందికి సోమవారం నుంచి 50రోజులు పాటు ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెక్షన్లలో శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం శిక్షణకు హాజరైన సర్వేయర్లకు సర్వే మెటీరియల్ను కలెక్టర్ అందజేశారు. అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి, నరసింహమూర్తి పాల్గొన్నారు.