
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నడికూడ: హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిగిల్ల గ్రామానికి చెందిన మోకిడి దీపక్ (30)హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ప నిచేస్తున్నాడు. బుధవారం ఉ దయం తన బైక్పై ప్ర యాణిస్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది.
ఈఎంటీ ఆత్మహత్యాయత్నం..?
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మండల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 108 ఈఎంటీ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కొద్ది రోజులుగా జీవీకే 108 విభాగం పైఅధికారులు వేధింపులతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఈఎంటీ బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో 108 వాహనంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే వాహనంలో ఉన్న మాత్రలు మింగినట్లు తెలిసింది. గమనించిన తోటి ఈఎంటీ, పైలెట్లు జీజీహెచ్కు తరలించి చికిత్స అందించినట్లు సమాచారం.