రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

May 8 2025 9:15 AM | Updated on May 8 2025 9:15 AM

రోడ్డు ప్రమాదంలో  యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నడికూడ: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిగిల్ల గ్రామానికి చెందిన మోకిడి దీపక్‌ (30)హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప నిచేస్తున్నాడు. బుధవారం ఉ దయం తన బైక్‌పై ప్ర యాణిస్తుండగా వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది.

ఈఎంటీ ఆత్మహత్యాయత్నం..?

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి మండల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 108 ఈఎంటీ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కొద్ది రోజులుగా జీవీకే 108 విభాగం పైఅధికారులు వేధింపులతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఈఎంటీ బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో 108 వాహనంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే వాహనంలో ఉన్న మాత్రలు మింగినట్లు తెలిసింది. గమనించిన తోటి ఈఎంటీ, పైలెట్లు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement