
డిస్నీల్యాండ్తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
దామెర: విద్యార్థుల బంగారు భవిష్యత్కు డిస్నీల్యాండ్ పాఠశాల బాటలు వేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. కాగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను శనివారం అభినందించింది. పాఠశాలకు చెందిన తుత్తురు హర్షిణి, బానోతు శ్రీమాన్ 569 మార్కులు సాధించారు మద్దూరి శ్రీకాంత్ 560 మార్కులు, 47 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ముఖ్యసలహాదారులు దయ్యాల మల్లయ్య, సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, డైరెక్టర్లు శోభారాణి, రాకేశ్భాను, దినేష్చందర్ ఉన్నారు.
9 ప్యాసింజర్ రైళ్లు రద్దు
● మే 3 నుంచి 5వ తేదీ వరకు..
కాజీపేట రూరల్: కాజీపేట నుంచి వెళ్లే పలు ప్యాసింజర్ రైళ్లను శనివారం నుంచి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్స్ లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డుల డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నందున సిబ్బంది కొరత వల్ల పలు రూట్లో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు బల్లార్షా– కాజీపేట (17036) వెళ్లే సింగరేణి ప్యాసింజర్, కాజీపేట–సిర్పూర్ కాగజ్నగర్ (17003) వెళ్లే ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) వెళ్లే ప్యాసింజర్, సికింద్రాబాద్–వరంగల్ (67761) వెళ్లే పుష్పుల్, వరంగల్–సికింద్రాబాద్ (67762) వెళ్లే పుష్పుల్, సికింద్రాబాద్–కాజీపేట (67763) వెళ్లే పుష్పుల్, కాజీపేట–సికింద్రాబాద్ (67764) వెళ్లే పుష్పుల్, కాజీపేట–డోర్నకల్ (67765) వెళ్లే పుష్పుల్, డోర్నకల్–కాజీపేట (67766) వెళ్లే పుష్పుల్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

డిస్నీల్యాండ్తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్