బియ్యం పంపిణీ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బియ్యం పంపిణీ పరిశీలన

Apr 2 2025 1:36 AM | Updated on Apr 2 2025 1:36 AM

బియ్య

బియ్యం పంపిణీ పరిశీలన

కురవి: మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారురాలి వేలిముద్రను పరిశీలించారు. రికార్డులను తని ఖీ చేసి, రేషన్‌ బియ్యం సక్రమంగా అందించా లని ఆదేశించారు. అర్హులకు అన్యాయం చేయ వద్దని అన్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ సునీల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

నేటినుంచి 11వరకు రైల్వేగేట్‌ మూసివేత

గార్ల/డోర్నకల్‌: రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పనుల దృష్ట్యా గార్ల–డోర్నకల్‌ మధ్యలోని రైల్వేగేటును బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు. ఈ రహదారి గుండా ఖమ్మం నుంచి మహబూబాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బ స్సులు, వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారుల గుండా ప్రయాణం సాగిస్తూ రైల్వేసిబ్బందికి సహకరించాలని వారు కోరారు.

వ్యవసాయ మార్కెట్‌కు

పోటెత్తిన మిర్చి

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణం మిర్చి బస్తాలతో కళకళలాడుతోంది. మార్చి 29నుంచి ఈ నెల 1వ తేదీ వరకు వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించగా బుధవారం నుంచి క్రయవిక్రయాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తుగా మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. సుమారు 8,500 బస్తాల మిర్చిరాగా 5,500 బస్తాలకు టోకెన్లు జారీ చేశామని, మిగిలిన మిర్చి బస్తాలకు కూడా టోకెన్లు ఇచ్చి కొనుగోళ్లు జరపనున్నట్లు ఏఎంసీ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌ తెలిపారు.

కాళేశ్వరంలో భక్తుల రద్దీ

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ముందుగా త్రివేణి సంమగ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయంలో పూజలు నిర్వహించారు.

బియ్యం పంపిణీ పరిశీలన
1
1/2

బియ్యం పంపిణీ పరిశీలన

బియ్యం పంపిణీ పరిశీలన
2
2/2

బియ్యం పంపిణీ పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement