
పర్యాటకులకు ఇబ్బంది కలగొద్దు
●
● ఎఫ్డీఓ ద్వాలియా
వాజేడు: బొగత జలపాతం వద్ద పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని వెంకటాపురం(కె) ఎఫ్డీఓ ద్వాలియా సిబ్బందిని కోరారు. శనివారం మండల పరిధిలోని చెరుకూరు వద్ద ప్లాంటేషన్లో చేపట్టిన పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం బొగత జలపాతానికి వచ్చిన ద్వాలియా అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. జలపాతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుడం జలపాతాలకు పర్యాటకులను వెళ్లకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్ఎస్ఓ నారాయణ, సిబ్బంది ఉన్నారు.