నెహ్రూసెంటర్: టీజీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా మహబూబాబాద్ డిపో నుంచి మొదటి యాత్ర ప్రత్యేక బస్సులను శుక్రవారం రాత్రి 11 గంటలకు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 సీట్ల డీలక్స్ బస్సు మహబూబాబాద్ నుంచి శ్రీశైలం బయల్దేరిందని తెలిపారు. జూలై 6వ తేదీన పంచరామాలు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట)కు యాత్ర బస్సు ఉందని, ఒక్కొక్కరికి రూ.1,700 చార్జీలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రజలు, యాత్రికులు ఆర్టీసీ యాత్ర ప్యాకేజీలను వినియోగించుకోవాలని తెలిపారు. బస్సుల బుకింగ్, యాత్ర సంబంధిత వివరాలకు నబి ఫోన్ నంబర్ 99482 14022 ద్వారా సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో చదువుతున్న పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నరసింహస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి నుంచి ఫీజీ వరకు చదువుతున్న విద్యార్థులు WWW.telaganaepass.cgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
బాలసదన్ సందర్శన
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని బాలసదన్ (బాలికల)ను శనివారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ శాలిని షాకెల్లి సందర్శించారు. బాలసదన్లోని వంట గది ఇతర గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సిబ్బంది అందుబాలో ఉండాలని ఆదేశించారు.
అభివృద్ధికి సహకరించాలి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్: అభివృద్ధి పనులకు ప్రజలు అన్నివిధాలా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అస్తినాపురం కాలనీ, గోపాలపురం కాలనీలను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా మురళీనాయక్ మాట్లాడుతూ.. 11వ వార్డుకు రూ.50 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
కుల్లా, నిత్యక్లిన్నాక్రమాల్లో
శ్రీభద్రకాళి
హన్మకొండ కల్చ రల్: శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నాక్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.
ఆర్టీసీ ప్రత్యేక టూర్ బస్సు ప్రారంభం
ఆర్టీసీ ప్రత్యేక టూర్ బస్సు ప్రారంభం