మరోసారి వివాదంలో కర్నూలు తాలూకా పీఎస్‌ | - | Sakshi
Sakshi News home page

మరోసారి వివాదంలో కర్నూలు తాలూకా పీఎస్‌

Sep 16 2025 7:47 AM | Updated on Sep 16 2025 7:47 AM

మరోసారి వివాదంలో కర్నూలు తాలూకా పీఎస్‌

మరోసారి వివాదంలో కర్నూలు తాలూకా పీఎస్‌

● ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి వసూళ్లకు పాల్పడిన ముఠా సభ్యులకు సహకరించి ఇటీవలనే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు సస్పెన్షన్‌కు గురయ్యారు.

● వారం రోజుల వ్యవధిలోనే అదే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంచలింగాల గ్రామం కేంద్రంగా గంజాయి వ్యాపారం సాగుతున్నట్లు వెలుగు చూడటంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

● గతంలో తనిఖీల్లో పట్టుబడిన 105 కిలోల వెండి ఇదే స్టేషన్‌లో భద్రపర్చగా ముగ్గురు సిబ్బంది కాజేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ కేసులో అప్పటి సీఐపై కూడా సస్పెన్షన్‌ వేటు పడింది.

● తమిళనాడుకు చెందిన వ్యాపారి వద్ద చెక్‌పోస్టు తనిఖీల్లో రూ.96 లక్షలు నగదు పట్టుబడగా అతనితో బేరాలు కుదుర్చుకుని గతంలో పనిచేసిన ఓ సీఐ రూ.12 లక్షలు మామూళ్లు దండుకున్నారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పట్లో పనిచేసిన సీఐపై కేసు నమోదై శాఖాపరమైన చర్యలకు గురయ్యారు.

● చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారికి సహకరించి గతంలో నలుగురు సిబ్బంది ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై జిల్లా సరిహద్దు స్టేషన్లకు బదిలీ అయ్యారు.

● స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది అక్రమ కార్యకలాపాలపై ప్రతి సంవత్సరం సస్పెన్షన్‌ వేటు పడుతుండగా.. గంజాయి దందాతో మరోసారి తాలూకా పోలీస్‌ స్టేషన్‌ చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement