
అమెరికా ఐవీఎల్పీకి డాక్టర్ వినూషారెడ్డి ఎంపిక
కర్నూలు కల్చరల్: రాజకీయాలలో మహిళల పాత్రపై అమెరికాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ పోగ్రామ్(ఐవీఎల్పీ)కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి డాక్టర్ బి.వినూషారెడ్డి ఎంపికయ్యా రు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ ఏడాది నిర్వహిస్తున్న బహు ళ ప్రాంతీయ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 20 మంది విశిష్ట మహిళా నాయకురాళ్లలో ఏకై క భారత ప్రతినిధి డాక్టర్ బి.వినూష రెడ్డి. ఈనెల 11 నుంచి 30వ తేదీ మధ్య మూడు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.