నీటి అగచాట్లు ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

నీటి అగచాట్లు ఇంకెన్నాళ్లు?

Jun 25 2025 6:47 AM | Updated on Jun 25 2025 6:47 AM

నీటి

నీటి అగచాట్లు ఇంకెన్నాళ్లు?

వెల్దుర్తి: ఇరవై రోజులుగా కుళాయిలకు నీళ్లు రాక అవస్థలు పడుతున్నామని వెల్దుర్తి పట్టణంలోని రాణితోటకు చెందిన మహిళలు స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. నీటి, ఇంటి పన్నులు కట్టించుకునే అధికారులు నీళ్లను ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. 20 రోజులుగా నీరు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. తమ నీటి కష్టాలను విన్నవించేందుకు పంచాయతీ కార్యాలయం చేరుకోగా అధికారులు, సిబ్బంది లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సెక్రటరీ లక్ష్మీనాథ్‌ మాట్లాడుతూ బ్రహ్మగుండం పథకం పైప్‌లైన్‌ లీకేజీలు, మరమ్మతుల నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. వెంటనే చర్యలు తీసుకుని నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. అయితే పంచాయతీ కార్యాలయంలో కొందరి సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యంతో పట్టణంలో తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం

కర్నూలు(టౌన్‌): మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు సర్వనాశనం అవుతాయని అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ రామక్రిష్ణా రెడ్డి అన్నా రు. మంగళవారం స్థానిక టౌన్‌ మోడల్‌ జూనియర్‌ కళశాలలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్యలు ఏర్పడతాయన్నారు. వీటిని సేవించడం వల్ల చట్టపరమైన సమస్యలు ఎదుర్కొ వాల్సి ఉంటుందన్నారు. అనంతరం మత్తు పదా ర్థాల జోలికి వెళ్లం అంటూ విద్యార్థినీ, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలోఎకై ్సజ్‌ అధికారులు రాజేంద్రప్రపాద్‌, కర్నూలు పట్టణ ఎస్‌ఐ నవీన్‌బాబు, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా

కర్నూలు సిటీ: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరై సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయిన విద్యార్థులకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడినట్లు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.వి.ఎస్‌.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సుల కౌన్సెలింగ్‌కు మొత్తం 228 మంది విద్యార్థుల సర్టిఫికెట్‌లను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ కమ్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌లను అందించారు. షెడ్యుల్‌ ప్రకారం వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నేటి(బుధవారం) నుంచి మొదలు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదికి వాయిదా వేసినట్లు కో–ఆర్డినేటర్‌ పేర్కొన్నారు.

నీటి అగచాట్లు ఇంకెన్నాళ్లు? 1
1/1

నీటి అగచాట్లు ఇంకెన్నాళ్లు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement