
పాముకాటుతో విద్యార్థి మృతి
ఆదోని అర్బన్: పట్టణంలోని ఎరుకల కాలనీకి చెందిన ఓ విద్యార్థి మంగళవారం పాముకాటుకు గురై మృతిచెందాడు. స్థానికంగా నివాసముంటున్న భారతి, మారేష్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమా ర్తె. పెద్ద కుమారుడు అభిరామ్ రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి అభిరామ్ ఇంట్లో భోజనం చేస్తుండగా కాలు వద్ద ఏదో కుట్టినట్లు కనిపించడంతో తల్లికి వచ్చి చెప్పాడు. అనుమానంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాము కాటేసిందని వైద్యులు గుర్తించి వైద్యం అందిస్తుండగా కోలుకోలేక మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.