
వీరజవాన్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
ఆదోని టౌన్: సత్యసాయి జిల్లా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆదోని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. గురువారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీరజవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మురళీనాయక్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర జవాన్ మురళీనాయక్ జీవితం స్ఫూర్తి దాయకమన్నారు. దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎర్రిస్వామి తదితరులు ఉన్నారు.
కౌన్సెలింగ్లో సాంకేతిక సమస్యలు
● కేంద్రం వద్దే ఉపాధ్యాయుల బస
కర్నూలు (సిటీ): ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యంగా కొనసాగుతోంది. గురువారం సీనియారిటీ జాబితాలోని సీరియల్ నెంబర్ 1101 నుంచి 2000 వరకు కౌన్సిలింగ్కు పిలిచారు. బదిలీల ప్రక్రియ మొదలైన సమయంలో జారీ చేసిన జీవోలో ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్జీటీ టీచర్లు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సెకండ్ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రతిరోజూ సీనియారిటీ జాబితా వచ్చిన తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రారంభిస్తున్నారు. దీనివలన ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలో తమ నంబర్ వచ్చేంత వరకు రాత్రుల్లో సిల్వర్జూబ్లీ కాలేజీ ఆవరణలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రం దగ్గర బెడ్షీట్లు తెచ్చుకుని నిద్రపోతున్నారు. వెబ్సైట్లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం, ఒక్కో టీచర్కి కనీసం 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుండటంతో కౌన్సెలింగ్ మరింత ఆలస్యమవుతోంది.

వీరజవాన్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం