
నీట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు కల్చరల్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి మే 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండ్లు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ చెప్పిన విషయాలు ఇవీ..
● జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల ఏర్పాటయ్యాయి. అన్నీ కర్నూలు నగరంలోనే ఉంటాయి.
● పరీక్షకు మొత్తం 4,466 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
● మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది.
● మే 4న ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పురీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.మధ్యాహ్నం 1.30 గంట తరువాత అనుమతించరు.
● ప్రతి నాలుగు కేంద్రాలకు ఒక జిల్లా అధికారి నియామించాం.
● దివ్యాంగ విద్యార్థులకు వీల్ చైర్లను ఏర్పాటు చేయాలి.
● కర్నూలు నగరంలో ట్రాఫిక్ అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.
● ట్రిపుల్ఐటీ డీఎం కేంద్రానికి వెళ్లేందుకు బస్సులు అందుబాటులో ఉంచాలి.
● పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాప్లను మూసివేయాలి. విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలి.
● సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదు.
● సమావేశంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ బాబు ప్రసాద్, డీఆర్ఓ వెంకటనారాయణమ్మ, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, నోడల్ ఆఫీసర్ పాయల్ ప్రియదర్శిని, డీఈవో శామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా