ప్రశాంతంగా ఏఎన్‌ఎంల పదోన్నతి కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఏఎన్‌ఎంల పదోన్నతి కౌన్సెలింగ్‌

Mar 19 2025 1:24 AM | Updated on Mar 19 2025 1:19 AM

కర్నూలు(హాస్పిటల్‌): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎం–3లకు ఎంపీహెచ్‌ఏ–ఎఫ్‌గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్‌ కాలేజీలోని నూతన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్‌లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి. శాంతికళ, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు ఆర్డర్‌ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి. శాంతికళతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్‌ పి. శ్రీనివాసులు, సీనియర్‌ అసిస్టెంట్‌ మధుసూదన్‌లు కౌన్సెలింగ్‌ నిర్వహించి స్థానాలు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement