రహదారి భద్రతపై అవగాహన కలిగించండి | - | Sakshi
Sakshi News home page

రహదారి భద్రతపై అవగాహన కలిగించండి

Jan 2 2026 12:30 PM | Updated on Jan 2 2026 12:30 PM

రహదార

రహదారి భద్రతపై అవగాహన కలిగించండి

వైఎస్సార్‌ టీఏ డైరీ ఆవిష్కరణ నృసింహ ఆలయంలో భక్తుల కోలాహలం

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రమాదాలు నివారించేందుకు రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలని కలెక్టర్‌ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా రవాణాశాఖ ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ భద్రత మాసోత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రజలు రహదారి భద్ర తపై అవగాహన కలిగి ఉండేందుకు రవాణా శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వ హించాలన్నారు. వాహనాల డీలర్లను, లారీ యజమానుల సంఘాలను, డ్రైవర్ల శిక్షణ కేంద్రాలను భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి శ్రీనివాసరావు, జిల్లా ప్రజారవాణాధికారి వెంకటేశ్వర్లు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.

హెల్త్‌ యూనివర్సిటీకి కెనరా బ్యాంక్‌ సాయం

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో సోలార్‌ పవర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కెనరా బ్యాంక్‌ రూ.40 లక్షల సాయం అందించింది. ఆ బ్యాంక్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మొత్తాన్ని వర్సిటీ వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌కు బ్యాంక్‌ డీజీఎం ఎ.రత్నాకరరావు చెక్కు రూపంలో గురువారం అందజేశారు. ఈ సంద ర్భంగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా బ్యాంకులు నిధులను నూతన సంవత్సరం రోజు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ నిధులతో సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు ద్వారా 100 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చునని పేర్కొన్నారు. కోవిడ్‌ మహమ్మారి సమాజాన్ని అతలాకుతం చేసిన సమయంలో ఎన్నో కార్పొరేట్‌ సంస్థలు తమ వంతు సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి మాస్కులు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, శానిటైజర్లు అందించాయని గుర్తుచేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్‌కట్‌చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వేమిరెడ్డి రాధికారెడ్డి, ప్రముఖ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి, రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రభ, పబ్లికేషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధ తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (వైఎస్‌ఆర్టీఏ) నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని వెంకటరామయ్య (నాని) గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి సేవలకు వైఎస్సార్‌ టీచర్స్‌ అసో సియేషన్‌ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, వృత్తిపరమైన అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని సూచించారు.

మంగళగిరి టౌన్‌: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి దిగువ, ఎగువ సన్నిధి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌ కుమార్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రహదారి భద్రతపై అవగాహన కలిగించండి 1
1/3

రహదారి భద్రతపై అవగాహన కలిగించండి

రహదారి భద్రతపై అవగాహన కలిగించండి 2
2/3

రహదారి భద్రతపై అవగాహన కలిగించండి

రహదారి భద్రతపై అవగాహన కలిగించండి 3
3/3

రహదారి భద్రతపై అవగాహన కలిగించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement